PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ట్రాఫిక్ జామ్ తో స్కూల్ విద్యార్థుల తీవ్ర ఇబ్బందులు..

1 min read

సకాలంలో స్పందించిన పోలీసులు..

పల్లెవెలుగు వెబ్ గడివేముల : గడివేముల మండల కేంద్రంలోని పాత బస్టాండ్ కూడలిలో గురువారం మధ్యాహ్నం రెండు గంటలు ట్రాఫిక్ జామ్ తో పాఠశాల స్కూల్ బస్సులో ఉన్న విద్యార్థిని విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు ఒకవైపు నంద్యాలకు జగనన్న సిద్ధం సభకు వెళుతున్న ఆర్టీసీ బస్సులు మరోవైపు వరిగడ్డి ట్రాక్టర్లు ట్రాఫిక్ జామ్ చేశాయి దీంతో స్పందించిన పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేసి స్కూల్ బస్సులో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు బిస్కెట్లు వాటర్ ప్యాకెట్లు అందజేశారు దీంతో స్థానికులు పోలీసులను అభినందించారు నిత్యం ట్రాఫిక్ జామ్ కావడం ఇరుకు రహదారి కావడంతో గడివేముల మండల వాసులకు ట్రాఫిక్ జామ్ నిత్యకృత్యం అయిపోయింది అయ్యా అధికారులు నాయకులు ఈసారి చొరవ చూపి బైపాస్ రహదారి మంజూరు చేస్తే ఈ సమస్య ఉండదని మండల వాసులు కోరుతున్నారు.

About Author