PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో ఆగ‌స్టు నుంచి స్కూల్స్ ప్రారంభం

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆంధ్రప్రదేశ్ లో ఆగ‌స్టు 16 నుంచి స్కూల్స్ పునఃప్రారంభం కానున్నాయి. క‌రోన రెండో ద‌శ త‌గ్గడంతో స్కూల్స్ తెర‌వాల‌ని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్కూల్స్ పునఃప్రారంభం పై ఏపీ విద్యాశాఖ త్వర‌లో విధివిధానాలు విడుద‌ల చేయనుంది. తొలివిడ‌త నాడు-నేడు ప‌నుల‌ను ఆగ‌స్టు 16న ప్రజ‌ల‌కు అంకితం చేయ‌నున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రక‌టించింది. ఈ సంద‌ర్భంగా విద్యార్థుల‌కు విద్యాకానుక కిట్ ను అందించ‌నున్నారు. శుక్రవారం నాడు-నేడు ప‌నుల‌పై జ‌రిగిన స‌మీక్షా స‌మావేశంలో జ‌గ‌న్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

About Author