NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శాఖ గ్రంధాలయంలో ఈనెల 24 వ తేదీ వరకు విజ్ఞాన శిబిరం       

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: దసరా సెలవులు సందర్భంగా పత్తికొండ శాఖ గ్రంథాలయంలో ఈనెల 15 వ తేదీ నుండి 24వ తేదీ వరకు విజ్ఞాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామని శాఖ గ్రంధాలయ అధికారి రామ్ కుమార్ తెలిపారు. పాఠశాలల్లోని విద్యార్థిని, విద్యార్థులు పై తేదీలలో గ్రంథాలయమునకు ఉదయం 8 గంటల నుండి 12 గంటలవరకువచ్చి పుస్తకాలుచదువుకావాలని ఆయన కోరారు. విజ్ఞాన శిబిరంలో పిల్లలకు కథలు చెప్పడం,  డ్రాయింగ్ నేర్పించడం, పాటలు, డాన్స్, బొమ్మలు తయారీ విధానం నేర్పించడం జరుగుతుందని గ్రంధాల అధికారి రాంకుమార్ తెలిపారు. కావున పాఠశాలల ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు ఆరు సంవత్సరాల నుండి 15 సంవత్సరాలు అనగా ఆరో క్లాసు నుండి పదో క్లాసు విద్యార్థిని, విద్యార్థులు గ్రంధాలయ విజ్ఞాన శిబిరంలో పాల్గొనవలసిందిగా కోరారు.

About Author