PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ భవనాల నిర్మాణాల కోసం అన్వేషణ

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది: మహానంది మండలంలోని గ్రామాల్లో ప్రభుత్వ భవనాల నిర్మాణాల కోసం నంద్యాల ఆర్డిఓ చాహత్ వాజ్పాయ్ అన్వేషణ ప్రారంభించారు. మండలంలోని బొల్లవరం, తమ్మడపల్లె తిమ్మాపురం, అభిపురం తదితర గ్రామాల్లో పర్యటించి భవన నిర్మాణాల కోసం సేకరించిన స్థలాలను పరిశీలించారు. నిలిచిపోయిన గ్రామ సెక్రటేరియట్ కార్యాలయాలను వెంటనే పూర్తి చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అధికారులకు ఆర్డిఓ పలు సూచనలు చేశారు. ఆమె వెంట మహానంది డిప్యూటీ తాసిల్దార్​ నారాయణ రెడ్డి, తిమ్మాపురం ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్ర అధికారులు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ లింగన్న, పి ఆర్ ఏ యు రాముడుబొల్లవరం, పంచాయతీ కార్యదర్శి సుప్రజ తదితరులు పాల్గొన్నారు.

About Author