PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

12 కిలోల వెండి స్వాధీనం

1 min read

వివరాలు వెల్లడించిన సెబ్​ సీఐ లక్ష్మి దుర్గయ్య
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు క్రైం: రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన పంచలింగాల చెక్​ పోస్టు వద్ద సెబ్​, లోకల్​ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా 12 కిలోల వెండి పట్టుబడిన ఘటన ఆదివారం రాత్రి 10.30 గంటలకు చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్​ నుంచి కర్నూలు వైపు హోండా యాక్టివ్​ ( ఏపీ 39 మీజే 1614)లో వస్తున్న రాజస్థాన్ లోని పాలి జిల్లా, గాయత్రి కాలనీకి చెందిన ఘన్​శ్యాం అనే వ్యక్తిని సెబ్​ పోలీసులు తనిఖీ చేయగా… అతని నుంచి 12 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద ఎటువంటి బిల్లులు, పన్ను చెల్లింపులు, ఆధారాలు లేకపోవడంతో వెండి, బైక్​ను స్వాధీనం చేసుకున్నట్లు సెబ్​ సీఐ లక్ష్మి దుర్గయ్య వెల్లడించారు. వెండి, బైక్​ను తాలూకా పోలీస్​ స్టేషన్​లో అప్పగించినట్లు సీఐ పేర్కొన్నారు. తనిఖీలో సెబ్​ ఎస్​ఐ శివప్రసాద్​, హెడ్ కానిస్టేబుల్​ ఖాజ, కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, హననుమంత నాయక్​, సలీం తదితరులు ఉన్నారు.

About Author