PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హోళగుంద చెక్ పోస్ట్ వద్ద.. 30 బాక్సుల కర్ణాటక మద్యం పట్టివేత

1 min read

– ఒకరు అరెస్టు… కారు సీజ్​
పల్లెవెలుగు వెబ్​, హొళగుంద: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోళగుంద చెక్ పోస్ట్ వద్ద ఉదయం 6 గంటలకు వాహన తనిఖీ సమయంలో సెబ్​ పోలీసులు కర్ణాటక మద్యం గుర్తించారు. 30 బాక్సుల కర్ణాటక మద్యం( 2,880 టెట్రా పాకెట్స్ )ను , ఫోర్డ్ ఫియస్టా కారు ( KA 03 MS 6421) ను ఆలూరు SEB పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్టు చేశారు. చెక్​ పోస్టు వద్ద కర్ణాటక మద్యం పట్టుకున్న సెబ్​ పోలీసులను సెబ్ అడిషనల్ ఎస్పీ తుహిన్ సిన్హా ఐపియస్ అభినందించారు. కేసులో సమగ్ర దర్యాప్తు చేయాలని వారిని ఆదేశించారు.

About Author