PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

1 min read

పల్లెవెలుగు వెబ్​: చాగలమర్రి పట్టణంలోని చింతలచెరువు రస్తాలోని యాగంటయ్య కళ్లం వద్ద అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు ఎస్సై రమణయ్య బుధవారం తెలిపారు . రాబడిన సమాచారం మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో యాగంటయ్య కళ్లం వద్ద దాడి చేసి అక్రమరవాణాకు సిద్ధంగా ఉంచిన 64 బస్తాలలో ఉంచిన 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నామని , నిందితుడు దస్తగిరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై వివరించారు. దువ్వూరుకు చెందిన మరో నిందితుడి కోసం గాలింపు చేపట్టిన్నట్లు ఎస్‌ఐ తెలియజేశారు . పట్టుబడిన రేషన్ బియ్యం సీజ్ చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించామన్నారు .

About Author