PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

30వేలు విలువ చేసే నిషేధిత గుట్కా స్వాధీనం

1 min read

– ముగ్గురి అరెస్టు…
పల్లెవెలుగు వెబ్​, రాయచోటి : రాయచోటి టౌన్ పరిధిలోని మదనపల్లి రోడ్డు రింగు రోడ్డు సర్కిల్ సమీపంలో కారులో అక్రమ రవాణా చేస్తున్న రూ.30వేలు విలువ చేసే నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ పి.శ్రీధర్​ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. రాయచోటి కి చెందిన షేక్ కీఫయతుల్లా,(22), పఠాన్ అసదుల్లా ఖాన్,(21),షేక్ నవాజ్ ఆలీ (21) కర్నాటక రాష్ట్రం చింతామణి నుండి సోమవారం ఉదయం ( నం.AP 03 A K0339 ) కారులో రూ. 30 వేలు విలువ చేసే నిషేధిత గుట్కా అక్రమ వ్యాపారం చేయడం కొరకు రాయచోటికి తీసుకొస్తున్నారు. ముందుగా అందిన సమాచారం మేరకు అర్బన్ సి ఐ జి రాజు మరియు ఎస్ ఐ మహమ్మద్ రఫీ తమ సిబ్బందితో దాడులు నిర్వహించారు. గుట్కాతోపాటు కారును స్వాధీనం చేసుకుని ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేశారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author