NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మద్యం బాటిళ్లు పట్టివేత..బైక్ సీజ్

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చెరుకుచెర్ల గ్రామానికి చెందిన పేరెడ్డి స్వామిరెడ్డి కుమారుడు పేరెడ్డి ప్రతాప్ రెడ్డి వద్ద నుండి 58 మద్యం బాటిళ్లను స్వాధీనం చేస్తున్నట్లు ఎస్ఐ జగన్ మోహన్ తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల మేరకు మిడుతూరు మండల కేంద్రంలో ఉన్న వైన్ షాప్ నుండి ప్రతాప్ రెడ్డి తన ద్విచక్ర వాహనంపై క్వాటర్ మద్యం బాటిళ్లను తీసుకెళ్తూ ఉండగా అందిన సమాచారం మేరకు చెరుకుచెర్ల గ్రామం బాట దగ్గర ఎస్సై మరియు సిబ్బందితో కలిసి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు అతనిపై కేసు నమోదు చేసి తన బైకును సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు.ఎవరైనా సరే మండలంలో ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సుబ్బయ్య,కానిస్టేబుల్ మాభాష పాల్గొన్నారు.

About Author