PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రూ.77.5 లక్షలు పట్టివేత

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు క్రైం : జిల్లా సరిహద్దు పంచలింగాల చెక్​ పోస్టు వద్ద వాహనాలు తనిఖీలో రూ.77.5 లక్షలు పట్టుకున్నారు సెబ్​, లోకల్​ పోలీసులు. హైదరాబాద్​– బెంగుళూరుకు వెళ్లే గరుడ ప్లస్​ బస్సు ‘TS 16 Z 0231) లో తెల్లవారు జామున 2.45 గంటలకు తనిఖీ చేయగా మధురాజ్​ షణ్ముగ సుందరం వద్ద ఎటువంటి ఆధారాలు లేని రూ.77.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ ఫక్కీరప్ప, సెబ్​ ఏఎస్​పీ గౌతమిసాలి ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీ చేస్తున్నామని పేర్కొన్న సెబ్​ సీఐ లక్ష్మి దుర్గయ్య.. సీజ్​ చేసిన నగదును తాలూకా పోలీస్​ స్టేషన్​లో అప్పగించామని వెల్లడించారు. తనిఖీలో ఎస్ఐ జీలాన్ బాషా, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరులు, కానిస్టేబుల్స్… ఇమాం బాషా, సుధాకర్ ,విజయ్ భాస్కర్,సుబాన్ వాలిరామకృష్ణ మరియు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

About Author