PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రీడా పోటీలకు ఎంపిక..

1 min read

– రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించిన జడ్పిటిసి ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి.
పల్లెవెలుగు వెబ్​ గడివేముల : మండల స్థాయి క్రీడా పోటీల ఎంపిక శిబిరాన్ని మంగళవారం నాడు ఎంఈఓ రామకృష్ణుడు జడ్పిటిసి ఆర్.బి చంద్రశేఖర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అవలంబించుకొని దేహదారుధ్యాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు మండలం నుండి ఆరు పాఠశాలలు తమ విద్యార్థిని విద్యార్థులు క్రీడా పోటీల ఎంపికలో పాల్గొన్నాయి కేజీబీవీ . మోడల్ పాఠశాల. గడిగరేవుల పాఠశాల. కరిమద్దుల పాఠశాల. రాజరాజేశ్వరి పాఠశాల. గని జిల్లా పరిషత్ పాఠశాల పాల్గొన్నట్టు స్పోర్ట్స్ మండల కోఆర్డినేటర్ పిఈ టీ. రవికుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఇంచార్జి హెడ్మాస్టర్ దస్తగిరమ్మ . ఎంపీటీసీ మహేశ్వర్ రెడ్డి . మాజీ ఎంపీటీసీ ఆర్ఐ సంజీవరెడ్డి.. నంద్యాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author