PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రెండు గంట‌ల‌కోసారి సెల్ఫీ.. ఏపీ ప్ర‌భుత్వం ఆదేశం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేసే డాక్టర్లకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ వైద్యులు ప్రతీ రెండు గంటలకు ఒకసారి సెల్ఫీలు తీసి పంపాలని ఆదేశించారు. డ్యూటీలో ఉన్న సమయంలో రెండు గంటలకు ఒకసారి ఈ సెల్ఫీలను అప్‌లోడ్ చేయాలంటూ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ స్పష్టం చేశారు. ఈ ఆదేశాలతో వైద్యులు ఆశ్చర్యపోయారు. ప్రభుత్వ వైద్యులు… ప్రైవేటు ప్రాక్టీసు చేయడం, డ్యూటీ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులలో ఉండటం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈమేరకు ఆదేశాలు ఇచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

                                           

About Author