PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీనియర్ కళాకారుడు మృతి

1 min read

– ప్రగాఢ సానుభూతి తెలిపిన టీడీపీ నాయకులు జయ సూర్య.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: మండల పరిధిలోని అల్లూరు గ్రామానికి చెందిన సీనియర్ కళాకారుడు గిత్త పక్కిరన్న శనివారం రాత్రి మృతి చెందాడు.1970 సంవత్సరం నుండి కళాభిమానిగా ఉంటూ దాదాపు 35 సంవత్సరాల పాటు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, పడక సీను తదితర వాటిపై నాటక ప్రదర్శనలు చేస్తూ వివిధ గ్రామాల్లో పలువురి మన్ననలు పొందుతూ నాటకాలు ప్రదర్శించేవాడు. కొంతకాలం నుండి అనారోగ్యం బారిన పడ్డాడు. కోలుకోలేక శనివారం రాత్రి మృతి చెందాడు. ఆయన ఎక్కువగా శ్రీకృష్ణుడు పాత్రలో కళాభిమానులను తన గాత్రంతో అలరించేవాడు. ఆయన మృతి పట్ల పలువురు కళాకారులైన దాసరి వేణుగోపాల్, దళిత సంఘం నాయకులు ప్రతాప్, రాష్ట్ర టిడిపి ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి జయసూర్య, ఆయన మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

About Author