PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంచ‌ల‌న ట్వీట్ చేసిన స‌మంత !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్ర‌ముఖ న‌టి స‌మంత సంచ‌ల‌న ట్వీట్ చేశారు. “నా నిశ్శబ్దాన్ని తెలియనితనంగా.. నా మౌనాన్ని అంగీకారంగా.. నా దయని బలహీనతగా ఎప్పుడూ చూడకండి.. దయకి కూడా ఒక ముగింపు తేదీ ఉంటుంది’’ అంటూ స్టార్ హీరోయిన్ సమంత చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఆమె దేనిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేసి ఉంటుందనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ద సోషల్ మీడియాగా మారింది. ప్రస్తుతం ఆమె విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో చేస్తున్న ‘కన్మణి రాంబో ఖతీజా’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ పాటలలో ఆమె గ్లామర్ ప్రదర్శన హాట్ టాపిక్ అవుతుంది. ఈ విషయంపై ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ చేస్తే ఆమె అలా స్పందించిందా? లేదంటే విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తాజాగా ఓ చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి సమంత హాజరు కాలేదని.. హీరో విజయ్ దేవరకొండ చేసిన పని ఆమెకు నచ్చలేదా? అన్న‌ది చ‌ర్చ జ‌రుగుతోంది.

                                               

About Author