PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌ద్ధతి మార్చుకోక‌పోతే తీవ్ర ప‌రిణామాలు : చంద్రబాబు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : త‌మ పార్టీ నేత‌ల‌పై త‌ప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నార‌ని, చ‌ట్టాన్ని ఉల్లంఘించి పనిచేస్తే తీవ్ర ప‌రిణామాలు త‌ప్పవ‌ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. వైకాపా అవినీతి పై దృష్టి మ‌రల్చేందుకే త‌మ పార్టీ నేత‌ల పై అక్ర‌మ కేసులు బనాయిస్తున్నార‌ని చంద్రబాబు ఆరోపించారు. గుంటూరు జిల్లా చింత‌ల‌పూడిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్రను ప‌రామ‌ర్శించారు. సంగం డెయిరీ కేసులో ఇటీవ‌ల జైలుకి వెళ్లి వ‌చ్చిన న‌రేంద్ర ఇంటికి చంద్రబాబు వెళ్లారు. వైకాపా నేత‌ల అవినీతి పై విచార‌ణ చేస్తే జైళ్లు కూడ స‌రిపోవ‌ని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప‌ద్దతి మార్చుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. పోలీసులు కూడ ఏక‌ప‌క్షంగా వ్యవ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ధూళిపాళ్ల న‌రేంద్రకు తెదేపా పూర్తీగా మ‌ద్దతు ఉంటుంద‌ని తెలిపారు.

About Author