PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పద్మశాలియులకు సేవ చేయండి..

1 min read

– వైసీపీ పట్టణ అధ్యక్షుడు, మాజీ మున్సిపల్​ చైర్మన్​ బుట్టారంగయ్య
పల్లెవెలుగు వెబ్​, ఎమ్మిగనూరు: పేద ప్రజలకు సేవలందిస్తూ ఆదరాభిమానాలు పొందిన ఎమ్మిగనూరు పట్టణ పద్మశాలి బహుతమ సంఘం నూతన అధ్యక్షుడు విశ్వనాథ్​ రమేష్ … ఇప్పటి నుంచి పద్మశాలియులకు కూడా సేవ చేయాలని సూచించారు వైసీపీ పట్టణ అధ్యక్షుడు , మాజీ మున్సిపల్​ చైర్మన్​ బుట్టారంగయ్య. ఎమ్మిగనూరు పట్టణంలోని లక్ష్మిపేటలో నివాసం ఉంటున్న మాజీ మున్సిపల్​ చైర్మన్​ బుట్టారంగయ్య, ఆయన సతీమణి ఏపీ రాష్ట్ర కుర్ణి కార్పొరేషన్​ చైర్మన్​ బుట్టా శారదమ్మ గురువారం విశ్వనాథ్​ రమేష్​తోపాటు సంఘం ఉపాధ్యక్షుడు బండారి ఈరన్న, యువజన సంఘం కోశాధికారి అడిమి ఉరుకుందును ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా బుట్టారంగయ్య మాట్లాడుతూ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన విశ్వనాథ్​ రమేష్.. ప్రజలకు సేవ చేయాలని, భవిష్యత్​లో మరెన్నో పదవులు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టౌన్​ బ్యాంక్​ డైరెక్టర్​ జి. శ్రీరాములు, విశ్వనాథ్​ కృష్ణమూర్తి, జి. మధు, వై. రమేష్​, కోదండ పాణి తదితరులు పాల్గొన్నారు.

About Author