PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కుమారుడి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు

1 min read

– పట్టణ నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం.
– భోజనం వసతి కల్పించిన నారాయణ.
– జలనీలా సోమశేఖర్ వర్ధంతి సందర్భంగా.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఒక్కగానొక్క కుమారుడు జ్ఞాపకాలు చెరిగిపోవద్దని తలచిన కుటుంబ సభ్యులు ప్రతి ఏటా కుమారుని పేరట సేవా కార్యక్రమాలు చేపట్టారు.పలువురి మనసులను గెలుచుకున్నారు. నందికొట్కూరు మండలం వడ్డేమాన్ గ్రామానికి చెందిన చాకలి నారాయణ కుటుంబ సభ్యులు. నారాయణ కుమారుడు సోమశేఖర్ రెండు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కుమారుడు జ్ఞాపకార్థం ఏటా కుటుంబ సభ్యులతో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోమవారం పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ,నారాయణ మాట్లాడుతూ తమ కుమారుడు సోమే శేఖర్ ఆకాల మరణం చెందడం చాలా బాధాకరమన్నారు. నేడు మా మధ్య లేడు అనే మాటను జీర్ణించుకోలేకపోతున్నాం. మా కుటుంబ సభ్యులు అంతా కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు . మనిషి ఎంత సంపాదించాడు అనేది కాదు ఎలా జీవించాడు అనేది ముఖ్యమన్నారు. మా మధ్యలో తిరిగే మా కుమారుడు మాతో లేడు,మనం పోయాక ఏ బంధాలు మనతో రావు, అందుకే మా కుటుంబ సభ్యులు మా కుమారుడు సోమశేఖర్ జ్ఞాపకార్థం సేవా కార్యక్రమంలో భాగంగా నిరాశ్రయ వసతి గృహంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము అన్నారు. ఈ కార్యక్రమంలో చాకలి నారాయణ, మహేశ్వరమ్మ, కృష్ణుడు ,లచ్చమ్మ, శోభారాణి, ఆంజనేయులు, రాముడు, మధు, శివ ,మంజుల, అంకాలమ్మ, వెంకటేశులు ,లలితమ్మ, అశోక్, అయ్యస్వాములు, అరుణమ్మ ,సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

About Author