NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ ఏర్పాటు

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు తహశీల్దార్  కార్యాలయం వద్ద స్పందన కార్యక్రమం జరుగు సమయంలో ఆంధ్రప్రదేశ్ మేనేజ్డ్ స్టాప్ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన మరియు స్టాల్ ఏర్పాటు చేశారు.ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల  స్టాల్ కు విశేష స్పందన లభించింది.ఈ స్టాల్ ను తహశీల్దార్ రాజశేఖర్ బాబు, ఎంపీడీఓ శోభారాణి , వ్యవసాయ అధికారి షేక్షావాలి ప్రారంభించారు .ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి షేక్షావాలి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన వినియోగదారులకు అమ్ముటకు ఈ స్టాల్ నిర్వహించడం జరిగిందని, ప్రతి సోమవారం వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద నిర్వహిస్తామని తెలిపారు. దీని ద్వారా పల్లెల్లో పండిన పంటలు పట్టణ వినియోగదారులకు ,అదేవిధంగా సంపద పట్టణాల నుండి పల్లెలోని రైతులకు నేరుగా చేరటానికి ఉపయోగపడతాయని తెలిపారు.కార్యక్రమంలో  టెక్నికల్ ఏఓ కలిమున్నీసా, ఉపాధి హామీ పథకం ఏపీఓ అలివేలమ్మ, సిబ్బంది నరేంద్ర, అయ్యస్వామి, మల్లికార్జున, కిరణ్ కుమార్, పరమేశ్వరి ,జ్యోతి ,పరిమళ ,పుష్పావతి ,తదితరులు పాల్గొన్నారు.

About Author