PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాయచోటిలో సేవాహీ సంఘటన్

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి : దేశ ప్రధాని నరేంద్రమోదీ.. ప్రధానిగా ఏడేళ్లు పూర్తి అయిన సందర్భంగా జాతీయ,రాష్ట్ర నాయకత్వం సూచనల మేరకు నగరంలోని బస్టాండ్​లో దుకాణదారులకు, ప్రయాణికులకు రాజంపేట పార్లమెంటరీ జిల్లా కార్యదర్శి ఆనంద గజపతి రాజు అధ్వర్యంలో మాస్కులు,శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గజపతి రాజు మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రేరణతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కరోన విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రయాణికులు, దుకాణదారులు, ప్రజలు మాస్క్​లు, శానిటైజర్లువాడాలని సూచించారు. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ రాజు గారు,నగర అధ్యక్షులు నిర్మల్ కుమార్, మల్లికార్జున, లోకేష్ రాజు, ఫణీంద్ర కుమార్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

About Author