PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్మీ వాహ‌నానికి ప్ర‌మాదం.. ఏడుగురు సైనికులు మృతి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : లడఖ్‌లోని టుర్టుక్ సెక్టర్‌లో శుక్రవారం జరిగిన వాహన ప్రమాదంలో దాదాపు ఏడుగురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన 19 మందిని ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నారు. ఉత్తమ వైద్య సంరక్షణ సేవలు అందజేసేందుకు కృషి చేస్తున్నట్లు భారత సైన్యం తెలిపింది. 26 మంది సైనికులు పార్తాపూర్ ట్రాన్సిట్ క్యాంప్ నుంచి హనీఫ్ సబ్ సెక్టర్ ఫార్వర్డ్ లొకేషన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో థోయిసే నుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం రోడ్డుపై నుంచి జారిపోయి, ష్యోక్ నదిలో పడిపోయింది. ఈ నది లోతు దాదాపు 50 నుంచి 60 అడుగుల వరకు ఉంటుంది. దీంతో సైనికులంతా గాయపడ్డారు.

                            

About Author