PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ బీచ్ లో ఏడుగురు విద్యార్థులు గల్లంతు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అన‌కాప‌ల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక బీచ్‌లో ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. అనకాపల్లి డైట్‌ కాలేజీ నుంచి బీచ్‌కు 15 మంది విద్యార్థులు వెళ్లారు. వారిలో ఏడుగురు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహాన్ని వెలికితీయగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గల్లంతైన వారిని జగదీష్‌, యశ్వంత్‌, సతీష్‌, గణేష్‌, చందుగా గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. విద్యార్థుల గల్లంతుపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

                                      

About Author