NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అలా అనుమ‌తించినందుకు ఏడుగురు ఉపాధ్యాయులు స‌స్పెండ్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలకు హాజరైన విద్యార్థినులను హిజాబ్ ధరించడానికి అనుమతించినందుకు ఏడుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసిన ఘటన కర్నాటకలోని గదగ్ జిల్లాలో వెలుగుచూసింది. గదగ్‌లోని సీఎస్‌ పాటిల్‌ బాలుర ఉన్నత పాఠశాల, సీఎస్‌ పాటిల్‌ బాలికల ఉన్నత పాఠశాలల్లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలు జరిగాయి.ఉపాధ్యాయులు కొందరు విద్యార్థినులను హిజాబ్ తో పరీక్షలు రాసేందుకు అనుమతించారు. దీంతో ఇద్దరు సెంటర్ సూపరింటెండెంట్లను కూడా కర్ణాటక సర్కారు సస్పెండ్ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించి హిజాబ్ తో విద్యార్థినులను పరీక్షలకు అనుమతించారని ఏడుగురు టీచర్లపై సర్కారు సస్పెన్షన్ వేటు విధించింది.

                          

About Author