PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎదురుకాల్పుల్లో ఏడుగురి హ‌తం

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్: జ‌మ్మూక‌శ్మీర్ లో భారీ ఎన్ కౌంట‌ర్ జ‌రిగింది. ఉగ్రవాదుల‌కు, పోలీసుల‌కు మ‌ధ్య భీక‌ర‌కాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పుల్లో 7గురు ఉగ్రవాదులు హ‌త‌మ‌య్యార‌ని పోలీసులు తెలిపారు. వీరిలో ఒక ముష్కర సంస్థ ప్రధాన నాయ‌కుడు ఉన్నట్టు స‌మాచారు. గురువారం, శుక్రవారం.. ఈ రెండు రోజులు పోలీసుల‌కు, ఉగ్రవాదుల‌కు వివిధ ప్రాంతాల్లో ఎదురుకాల్పులు జ‌రిగాయి. ముందుస్తు జాగ్రత్తగా పుల్వామ‌, షోపియ‌న్ జిల్లాల్లో ఇంట‌ర్నెట్ స‌దుపాయం నిలిపేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. ఈ రెండు ఘ‌ట‌న‌ల్లో ఏడుగురు మ‌ర‌ణించ‌గా.. మ‌రో న‌లుగురు ఉగ్రవాదులు గాయ‌ప‌డిన‌ట్టు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఉగ్రవాద సంస్థ నాయకుడు ఇంతియాజ్ షా ఉన్నట్టు స‌మాచారం.

About Author