NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టిడిపిలో చేరిన షారూఖ్ ఖాన్ అభిమానులు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: హీరో షారూఖ్ ఖాన్ అభిమానులు తెలుగుదేశం పార్టీలో చేరారు. కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టిజి భరత్ వీరికి కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా విడుదల సందర్భంగా మౌర్య ఇన్ లో అభిమానులతో కలిసి టిజి భరత్ భారీ కేకును కట్ చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని ఈ సందర్భంగా టిజి భరత్ వారికి సూచించారు. రానున్న ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో షారూఖ్ ఫ్యాన్స్ జిల్లా ప్రెసిడెంట్ ఆదిల్, వైస్ ప్రెసిడెంట్ సమీర్, సిటీ ప్రెసిడెంట్ ఆరిఫ్, అల్తాఫ్, టిడిపి నేతలు గున్నామార్క్, మెహబూబ్ ఖాన్, రమీజ్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

About Author