NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

షోరూమ్ లో రైతుకు అవమానం.. ఆనంద్ మహీంద్ర స్పందన !

1 min read

పల్లెవెలుగువెబ్ : కర్ణాటకలో కారు కొనేందుకు మహింద్రా షోరూం వెళ్లిన రైతుకు జరిగిన అవమానం పై ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఆ సంస్థ చైర్మన్ ఆనంద్ మహింద్రా స్పందించారు. కస్టమర్లకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన నొక్కిచెప్పారు. బాధ్యులపై త్వరితగతిన చర్యలు తీసుకుంటామన్నారు. కర్ణాటకలోని తుముకూరు నగరంలో మహింద్రా షోరూంలో బొలెరో పికప్ ట్రక్ కొనేందుకు కెంపెగౌడ అనే రైతు వెళ్లారు. సేల్స్ మెన్ పది రూపాయలకు స్తోమత లేని నువ్వు … పది లక్షల వాహనం ఎప్పుడు కొంటావంటూ అవమానించాడు. దీంతో రైతు కొన్ని గంటల్లోనే పదిలక్షల డబ్బుతో వచ్చి వాహనం డెలివరీ ఇవ్వమని అడిగాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

       

About Author