PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శవరాజకీయాలు చేయడం సిగ్గుచేటు..

1 min read

– నారాలోకేష్​పై ఎమ్మెల్యే ఆర్థర్​ ఫైర్​
పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ శవరాజకీయాలు చేస్తున్నాడని నందికొట్కూరు ఎమ్మెల్యే తోగురు ఆర్థర్​ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కర్నూలు జిల్లా గడివేముల మండలంలోని పెసరవాయి గ్రామంలో వడ్డు నాగేశ్వర రెడ్డి,వడ్డు ప్రతాప్ రెడ్డి జంట హత్యల ఘటన వ్యక్తిగత కారణాలతో జరిగిందని ప్రజలు చెబుతున్నారని, హత్య రాజకీయాలను వైసీపీ ప్రోత్సహించదని ఆయన స్పష్టం చేశారు. శనివారం నందికొట్కూరులో వైసిపి కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గత ప్రభుత్వంలో 30కి పైగా రాజకీయ హత్యలు జరిగాయని, అప్పుడు ఏ రాజ్యాంగం నడిచిందో చంద్రబాబు, లోకేష్ చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ నేతలు ప్రజల విశ్వాసం కోల్పోయారని మండిపడ్డారు. సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్ ధర్మా రెడ్డి, నందికొట్కూరు సింగిల్ విండో చైర్మన్ బాలస్వామి, వైసిపి మండల నాయకులు వెంకట రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, తమ్మడ పల్లి విక్టర్, పెరుమళ్ల జాన్, తాటిపాటి అయ్యన్న, వైసిపి పట్టణ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి వనజ, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author