NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ద్ర‌వ్యోల్బ‌ణం క‌న్నా వాటి పైనే ఆమెకు ఆస‌క్తి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం కన్నా యురేనస్, ప్లూటోలపైనే ఎక్కువ ఆసక్తి అని కాంగ్రెస్ మండిపడింది. నాసా వెబ్ టెలిస్కోప్ తీసిన చిత్రాలను ట్వీట్ చేయడంలో ఆమె తీరిక లేకుండా గడుపుతున్నారని ఆరోపించింది. ద్రవ్యోల్బణాన్ని ఎలా కట్టడి చేయాలనుకుంటున్నదీ ప్రజలకు వివరించడం లేదని పేర్కొంది. ద్రవ్యోల్బణం గణాంకాలను ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ విలేకర్లతో మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ఎటువంటి ప్రణాళికను రచించారో దేశ ప్రజలకు వివరించడం కన్నా నాసా వెబ్ టెలిస్కోప్ తీసిన చిత్రాలను ట్వీట్ చేయడంలో తీరిక లేకుండా గడుపుతున్నారన్నారు.

                                               

About Author