PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దైవ..దేశభక్తితో మెలగాలి :  శ్రీ  కె. నారాయణగురుజి

1 min read

పల్లెవెలుగు వెబ్​: ప్రతిఒక్కరూ దైవ…దేశభక్తితో మెలగాలని పిలుపునిచ్చారు శ్రీ కె. నారాయణ గురుజి. చైత్ర పౌర్ణమి శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా రాయచూరు జిల్లా కేంద్రంలోని బొగ్గల ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, పంచముఖి ఆంజనేయస్వామి హోమం నిర్వహించారు.  శనివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు జరిగిన కార్యక్రమంలో శ్రీశారదాంబ జ్యోతిషాలయం శిష్య బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ కె. నారాయణ గురుజి మాట్లాడుతూ హిందూ సంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలను కొనసాగించాలన్నారు. శ్రీరామ సంకీర్తన, చెక్కభజన, కోలాటాలు, వివిధ కళారూపాల బృందాలతో  హనుమాన్​ జయంతి ఉత్సవాలను నిర్వహించడం సంతోషించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో శారదాంబ జ్యోతిషాలయం శిష్య బృందం పెద్దబాబు, కరియప్ప, వార్డు కౌన్సిలరు తిమ్మరెడ్డి, మెటికల నరసింహులు, స్టోర్​ డీలరు రాము, సెంట్రింగ్​ మేస్త్రి మారెప్ప , మేస్త్రి మారెప్ప, మేస్త్రి ఆంజనేయ, గురురాజ్​ మాస్టర్​, మట్టిపేట నాగరాజు, నర్సప్ప కురుడి, కొత్తపేట తిమ్మరాజ్​, పెద్ద నరసింహులు, చిన్న నరసింహులు, టి.మారెప్ప,  వజ్ర ఫోటో స్టూడియో మంజు, భరత్​ అంగడి, అనిల్​ కుమార్​,  ఈరన్న చిరంజీవి, అంజి,  పి.శీను, కె.హనుమంతు, ప్రకాశ్​, నగేష్​ పూజారి, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

About Author