PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శివనామ స్మరణ తో మార్మోగిన శివాలయాలు..

1 min read

శ్రీ కాశీ విశ్వ నాద ఆలయంలో అన్నదానం

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మండలంలోని శివాల పల్లె గ్రామ పరిధిలో వెలసిన శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో విజయ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అధినేత ఇంది రెడ్డి మాధవరెడ్డి,ఇంది రెడ్డి వెంకటసుబ్బమ్మ దంపతుల ఆధ్వర్యంలో కార్తీక మాస మూడవ సోమవారం సందర్భంగా ఆలయం కు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడి కోట మోహన్ రెడ్డి, కాసిం ఖాన్, తిమ్మారెడ్డి తో పాటు మాధవ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు గావించారు, ఈ సందర్భంగా వీరిని ఆలయ మర్యాదలతో ఆలయ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు, అనంతరం ఇంది రెడ్డి మాధవరెడ్డి దంపతులు మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా శివాల పల్లె గ్రామ పరిధి లో వెలసిన శ్రీ కాశీ విశ్వనాథ స్వామి సన్నిధిలో కార్తీక మాస మూడవ సోమవారం ఆలయానికి వచ్చే భక్తులకు, గ్రామ ప్రజలకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు, ఈ అన్న దాన కార్యక్రమంలో దాదాపు 7, నుండి 8వేల మందికి  అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని వారు తెలిపారు, భక్తులెల్లర్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్లను కృపకు పాత్రులు కాగలరని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో సాయి మహేశ్వర్ రెడ్డి, జ్యోతి, చంద్రారెడ్డి, తిమ్మారెడ్డి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

About Author