PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లలితా పీఠంలో ఘనంగా ముగిసిన శివరాత్రి ఉత్సవాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​: కర్నూలు నగరంలోని  శ్రీ లలితా సుందరేశ్వర స్వామి వారి సన్నిధిలో అత్యంత భక్తి శ్రద్ధలతో శివరాత్రి వేడుకలు  జరిగాయి. గత మూడు రోజుల నుండి శ్రీ లలితా సుందరేశ్వర స్వామి వారి కళ్యాణము, రథోత్సవం, లక్షబిల్వార్చన, భస్మాభిషేకం, పంచామృతాభిషేకం,తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హరికథా కార్యక్రమం జరిగాయి. ఈ ధార్మికోత్సవాల ముగింపు సందర్భంగా శ్రీ లలితా సుందరేశ్వర స్వామి వారికి అన్నాభిషేకం, శ్రీవారి మాతృ మండలి ఆధ్వర్యంలో భక్తి సంకీర్తనల కార్యక్రమం , మేడా సుబ్రహ్మణ్యం స్వామి ధార్మికోపన్యాసంతో ముగిశాయి. ఈ కార్యక్రమంలో శ్రీవారి మాతృ మండలి సుభాషిణి, ఉమాదేవి, మహాలక్ష్మి, కృష్ణవేణి తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, సిడిపిఒ వరలక్ష్మీ, శ్రీలక్ష్మి విద్యా సంస్థల డైరెక్టర్ శ్రావ్యా కార్తిక్, పశువైద్య సహాయ సంచాలకులు డాక్టర్ రాజశేఖర్,ఇంజనీర్ చెన్నకేశవ నాయక్ ,శ్రీ శ్రీ శ్రీ సద్గురు పరిపూర్ణ తాండవ నాగలింగ శివాచార్య జీవైక్య మఠం పీఠాధిపతులు శ్రీ ఎల్లప్ప స్వామి, కాశీ విశ్వనాథ గౌడ్, విజయ్, లలితా పీఠం సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author