NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైల్వే ప్ర‌యాణీకుల‌కు షాక్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రైల్వే ప్రయాణికులకు కేంద్రం భారీ షాకిచ్చింది. బుక్‌ చేసుకున్న ట్రైన్‌ టికెట్‌లను క్యాన్సిల్‌ చేసుకుంటే వాటిపై జీఎస్టీ వసూలు చేయనున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ సర్క్యిలర్‌ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం, ఫస్ట్ క్లాస్ లేదా ఏసీ కోచ్ టిక్కెట్‌ను రద్దు చేసుకుంటే.. ఆ టికెట్లపై మాత్రమే 5 శాతం జీఎస్టీని విధిస్తున్నట్లు తెలిపింది. ట్రైన్‌ టికెట్‌ రద్దుపై ఛార‍్జీ (జీఎస్టీ) అనేది.. ఒప్పంద ఉల్లంఘనకు బదులుగా చెల్లించేదని ఆ సర్క్యిలర్‌లో పేర్కొంది.

                               

About Author