PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీకి దిమ్మదిరిగే షాక్…

1 min read

వైసీపికి చెందిన రాష్ట్ర నాయకులు టీడీపీలో చేరిక.

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన చెరుకు చెర్ల.

మరికొంతమంది వైసీపీ ప్రధాన నాయకులు.

పల్లెవెలుగు వెబ్​ నందికొట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి దిమ్మదిరిగే షాక్ తగిలింది. వైసీపీ పార్టీకి చెందిన రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు వైసీపీకి గుడ్ బై చెప్పారు. శుక్రవారం నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా  విచ్చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో  టీడీపీ పార్టీలో చేరారు. నందికొట్కూరు నియోజకవర్గం మిడుతూరు మండలం చెరుకుచెర్ల గ్రామానికి చెందిన వైసీపీ రాష్ట్ర ఆదనపు కార్యదర్శి చెరుకు చెర్ల రఘు రామయ్య తన అనుచరులతో నంద్యాల టీడీపీ  ఎంపీ అభ్యర్థి డా.బైరెడ్డి శభరి , టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్  ఆధ్వర్యంలో  టీడీపీపార్టీలో చేరారు.వీరితో పాటు నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామం మాజీ సింగిల్ విండో చైర్మన్ చందమాల బాలస్వామి, పగిడ్యాల మండలం ప్రాతకోట కు చెందిన వైసీపీ నంద్యాల జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సగినేల వెంకట రమణ , నందికొట్కూరు వైసీపీ నాయకులు తమ్మడపల్లి విక్టర్, వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు రామ తులశమ్మ లను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.చేరికతో వైసీపీ పార్టీకి నియోజకవర్గంలో తీవ్ర నష్టం కలుగుతోందని ప్రజలు భావిస్తున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

About Author