PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైఎస్సార్సీపీకి షాక్

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం అవుకు మండలం లో టీడీపీ కార్యాలయం నందు అవుకు మండలం మంగంపేట తాండా గ్రామానికి చెందిన వైఎస్ఆర్ పార్టీకి చెందిన 15 కుటుంబాలు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే” బి.సి జనార్ధన్ రెడ్డి “గారి సమక్షంలో గొలు నాయక్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన భాస్కర్ నాయక్, శ్రీరాములు,రాములానాయక్, పిదావత్ సోముల నాయక్,వెంకటరాముడు నాయక్, డాకు నాయక్, కూడ నాయక్,కొర్ర రామాంజినేయులు నాయక్,కడ్లావత్ బాలరాజు నాయక్,జమ నాయక్ వారందరికీ టీడీపీ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించడం జరిగినది.అనంతరం బీసీ జనార్దన్ రెడ్డి గారు మాట్లాడుతూ మంగంపేట తాండా గ్రామంలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదనే కారణం తో తాండా ప్రజలు విసుగు చెంది టీడీపీ పార్టీలో చేరారనీ అన్నారు. తెలుగుదేశం పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం అని కనుకేనియోజకవర్గంలో త్వరలో వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి చాలామంది ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author