PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లెవెలుగు వెబ్​, అనంతపురం: మాజీ మంత్రి పరిటాల సునీత సొంత మండలంలో పరిటాల కుటుంబానికి షాక్ తగిలింది. రామగిరి మండలం గంతిమర్రి పంచాయతీ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి రాజప్ప వైసీపీలో చేరారు. తోపుదుర్తి రాజశేఖర రెడ్డి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తోపుదుర్తి రాజశేఖర రెడ్డి మాట్లాడతూ వైసీపీతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. రాప్తాడు నియోజకవర్గంలో త్వరలో టీడిపి ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు.

About Author