PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి కి షాక్… 27 కుటుంబాలు వైసీపీలో చేరిక

1 min read

సాదరంగా ఆహ్వానం పలికిన ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు, ఎంపీ కోటగిరి శ్రీధర్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతి : నిధిజంగారెడ్డిగూడెం మండలంలోని పుట్లగట్ల గూడెం గ్రామంలో సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీకి చెందిన  27 కుటుంబలు వైఎస్సార్సీపీ పార్టీలో చేరారు. టిడిపి చెందిన 27 కుటుంబాలకు వారికి చింతలపూడి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు  ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ , సీనియర్ వైఎస్ఆర్సిపి నాయకులు జట్టు గురునాధరావు, వైఎస్ఆర్సిపి కండువాలు వేసి వారిని సాధనంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్సిపి పార్టీ అందరికీ సంక్షేమ పథకాలు అందించి అండగా ఉంటుందన్నారు. అన్ని వర్గాల వారికి సమాంతర న్యాయం చేసే విధంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం మునుపెన్నడూ లేని విధంగా ఉందని అన్ని వర్గాల వారికి పెద్దపీట వేశారన్నారు. మనమంతా ఆయనకు అండగా ఉండి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి విజయానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైఎస్ఆర్సిపి నాయకులు కోటగిరి అనిత, గోపాల్ యాదవ్, గ్రామ నాయకులు వైఎస్ఆర్సిపి అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

About Author