NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏటీఏం సిబ్బందిపై సినీ ఫ‌క్కీలో కాల్పులు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: కూక‌ట్ ప‌ల్లిలో ఏటీఏం సిబ్బంది మీద కాల్పులు క‌ల‌క‌లం రేపాయి. ప‌టేల్ కుంట ఏటీఎం వ‌ద్ద న‌గ‌దు నింపేందుకు సిబ్బంది వెళ్లారు. న‌గ‌దు నింపుతున్న సిబ్బంది మీద హ‌ఠాత్తుగా గుర్తుతెలియ‌ని వ్యక్తులు కాల్పులు జ‌రిపారు. న‌గ‌దు మొత్తం దోచుకెళ్లారు. ఏటీఎం సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ కాల్పుల్లో ఏటీఏం సిబ్బంది అలీబేగ్, శ్రీనివాస్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స్థానికులు గాయ‌ప‌డ్డ వారిని అంబులెన్స్ లో ఆస్పత్రికి త‌ర‌లించారు. స‌మాచారం అందుకుని ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బుల్లెట్లను, బుల్లెట్ లాక్ ను స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దుండ‌గుల్ని గుర్తించే ప్రయ‌త్నం చేస్తున్నారు.

About Author