PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తితిదే ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో  శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

1 min read

– ఉమ్మడి జిల్లాలో రెండు కేంద్రాలలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం.- సత్యమే లోకేశ్వరుడు

– డాక్టర్ మల్లు వేంకటరెడ్డి

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  శ్రావణ పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం, హెచ్.కైరవాడి గ్రామంలోని శ్రీ రామాలయం నందు, నంద్యాల జిల్లా, జూపాడుబంగ్లా  మండలం,పారుమంచాల గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నందు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేదపండితుల ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి వ్రత మహత్మ్యాన్ని గురించి సోదాహరణంగా వివరించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి మాట్లాడుతూ సత్యమే ఈశ్వరుడని, సత్యాన్ని నమ్ముకుంటే అనంతమైన పుణ్యఫలం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ధార్మిక సంస్థల ప్రతినిధులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author