PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ రంగా గౌడ్  మృతి బీజేపీ పార్టీకి తీరని లోటు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  భారతీయ జనతా పార్టీ పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ శ్రీ రంగా గౌడ్  హైదరాబాద్ యశోద హాస్పిటల్ లో అనారోగ్యంతో తుది శ్వాస వదిలారు,కీర్తిశేషులు రంగ గౌడ్  విద్యార్థిగా జాతీయ వాదమువైపు అడుగులువేస్తూ ABVPలో పనిచేస్తూ అంటుపిమాట విలేఖరిగా చేస్తూ బిజెపిలో చేరి రాజకీయ జీవితం ప్రారంభించి పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని  తుగ్గలి మండల అధ్యక్షునిగా అనంతరం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ 2019 సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికలలో పత్తికొండ నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా పోటీ చేసారు, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ పత్తికొండ అసెంబ్లీ కన్వీనర్ గా కొనసాగుతూ ఉన్నారు, కీర్తిశేషులు రంగా గౌడ్ క్రమశిక్షణతో పార్టీలో అంచలంచెలుగా ఎదుగుతున్న నాయకున్ని కోల్పోవడం పట్ల జిల్లా భారతీయ జనతా పార్టీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ…జిల్లా బిజెపి అధ్యక్షులు రామస్వామి , సీనియర్ నాయకులు రాజ్యసభ సభ్యులు టీజీ వేంకటేష్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రమౌళి , రాష్ట్ర క్రమశిక్షణ సంఘ కో కన్వీనర్ కపిలేశ్వరయ్య , జిల్లా ప్రధాన కార్యదర్శిలు కాలింగ్ నరసింహ వర్మ, కాశీ విశ్వనాథ్   మొదలగువారు కీర్తిశేషులు రంగా గౌడ్ మృత్తి పట్ల తీ తీవ్ర కాడ సంతాపం తెలియజేశారు.

About Author