PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల షటిల్ పోటీలు..

1 min read

పల్లెవెలుగు, వెబ్​ ఏలూరు : రాష్ట్రస్థాయి జర్నలిస్టుల షటిల్ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జెశాఫ్) నేతృత్వంలో అనేక క్రీడా పోటీలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో షటిల్,క్రికెట్,కబడ్డీ పోటీలు అత్యంత ఘనంగా జరిగాయి.ఈ సారి అంతఘనంగా క్రీడలు నిర్వహించడానికి నేడు ఏలూరు ఇండోర్ స్టేడియం నందు(ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా) జర్నలిస్టులు తలారి స్వామి, విజయ్ ఆధ్వర్యంలో పూనుకున్నారు.అత్యంత వైభవంగా,ఘనంగా రాష్ట్రస్థాయి షటిల్ పోటీలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం.అతి ఘనంగా ఏలూరు పేరు యావత్తు రాష్ట్రంలో గుర్తుండి పోయేలా షటిల్ పోటీలు నిర్వహించి రాష్ట్ర వ్యాప్త జర్నలిస్టులను ఏలూరు వేదికగా కలవడానికి ప్రయత్నం చేస్తున్నామన్నరు.ఈ బృహత్తర కార్యక్రమానికి మీ అందరి సహాయ సహకారాలు ఎంతో అవసరం,కీలకం.మీ ప్రోత్సహంతో ఈ కార్యక్రమన్ని ఎంతోఘనంగా నిర్వహించగలం అనే నమ్మకం తో ఆహ్వాన పలుకుతున్నట్టు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.

About Author