PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్ఐ చిరంజీవికి సీఐగా పదోన్నతి

1 min read

పల్లెవెలుగు వెబ్  మిడుతూరు: కర్నూలు ట్రాన్స్ కోలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సాకె. చిరంజీవి సీఐగా పదోన్నతి పొందారు.గతంలో మిడుతూ రు పోలీస్ స్టేషన్ లో 19.10.2011 నుంచి 2012 వరకు ఎస్సైగా విధులు నిర్వహించారు.ఇక్కడ ఆయన పని చేసిన సమయంలో శాంతి భద్రతల విషయంలో ఎవరితో రాజీ పడకుండా కఠినంగా వ్యవహరిస్తూ అప్పట్లో మండల ప్రజల మన్ననలు పొందారు.అదేవిధంగా స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడికి నేను ఉన్నాననే భరోసాను ఆయన కల్పించారని అనడంలో చెప్పనవసరం లేదు.అదేవిధంగా ఎస్ఐ చిరంజీవి జిల్లాలోని ఓర్వకల్లు పాణ్యం కర్నూలు-1,4 పట్టణ స్టేషన్లు మరియు ఆదోని 1,2 వ పట్టణ స్టేషన్లలో ఆయన పని చేసినట్లు ఆయన అన్నారు.పదోన్నతి పొందిన తర్వాత కర్నూలు జిల్లా ఎస్పీ జి.కృష్ణ కాంత్ కు రిపోర్టు చేసుకున్నామని రెండు మూడు రోజుల్లో సీఐగా స్థానం కేటాయించే అవకాశాలు ఉన్నాయని పల్లెవెలుగు పాత్రికేయుడుతో ఎస్సై అన్నారు.

About Author