PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మానవత్వం చాటుకున్న ఎస్​ఐ

1 min read

పల్లెవెలుగు వెబ్​, మన్నూరు: కడప జిల్లా మన్నూరు పరిధిలోని పులపుత్తూరు గ్రామంలో ఓ ఎస్​ఐ మానవత్వం చాటుకున్నారు. శుక్రవారం కడప జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా పులపుత్తూరు గ్రామంలోని చెయ్యేరు చెరువు ఉధృతంగా ప్రవహించింది. చెరువులో ఓ వృద్ధుడి మృతదేహం కొట్టుకురావడాన్ని గుర్తించిన  ఎస్​ఐ భక్తవత్సలం స్థానికుల సహాయంతో మంచంపై వృద్ధుడి మృతదేహాన్ని తరలించారు.  ఇది చూసిన స్థానికులు, పోలీసులు ఎస్​ఐ భక్తవత్సలం ను అభినందించారు.

About Author