PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘సిద్ధం’సభకు భారీగా తరలిన వైసీపీ శ్రేణులు

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైకాపా భారీగా ఏర్పాటు చేసిన సిద్ధం సభకు నంద్యాల జిల్లా మిడుతూరు మండలం నుంచి వైకాపా శ్రేణులు భారీగా తరలి వెళ్లారు.రాయలసీమలో ఉన్న 52 నియోజకవర్గాలకు కలిపి రాప్తాడులో భారీ బహిరంగ సభ ఆదివారం సాయంత్రం ఉండటంతో ఉదయం నుంచే బస్సుల్లో నాయకులు కార్యకర్తలు వెళ్లారు.సిద్ధం సభకు వెళ్లిన వారిలో జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి,ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి,మిడుతూరులో వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి,ఏఎంసీ మాజీ చైర్మన్ చిన్నమలారెడ్డి,నాగలూటిలో సహకార సొసైటీ చైర్మన్ నాగ తులసి రెడ్డి,వైస్ ఎంపీపీ నబి రసూల్,అలగనూరులో గ్రామ సర్పంచ్ కృష్ణ వేణమ్మ మరియు చిన్న రామచంద్రారెడ్డి,చౌటుకూరులో బి గోపాల్ రెడ్డి,బన్నూరులో పిక్కిలి బలరాముడు,సుదర్శన్ రెడ్డి,కడుమూరులో శంకర్ రెడ్డి, పైపాలెం సర్పంచ్ మర్రి రామచంద్రుడు జలకనూరు రామలింగేశ్వర రెడ్డి రవి పుల్లయ్య వివిధ గ్రామాల నాయకులు ఫణి భూషణ్ రెడ్డి,వైసీపీ మండల ఉపాధ్యక్షులు అన్వర్ భాష,మహబూబ్ బాష మరియు తదితర గ్రామాల నాయకుల ఆధ్వర్యంలో బస్సుల్లో వెళ్లారు.

About Author