PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేవాలయానికి సిద్ధార్థ రెడ్డి 50 వేలు సహాయం

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ మరియు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కర్రెమ్మ గుడి దేవాలయ నిర్మాణానికి తన వంతుగా ఆయన 50వేల రూపాయలు ఇస్తూ గొప్ప మనసును చాటుకున్నారు.మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరు గ్రామంలో గత కొన్ని రోజులుగా కర్రెమ్మ గుడి దాతల సహకారంతో గ్రామ పెద్దలు నిర్మిస్తూ ఉన్నారు.నంద్యాల జిల్లా వైఎస్ఆర్సిపి ఐటీ వి భాగం జిల్లా అధ్యక్షులు ఎస్. జగన్ మోహన్ రెడ్డి దేవాలయ నిర్మాణం గురించి సిద్ధార్థ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే సిద్ధార్థ రెడ్డి మంచి మనసుతో స్పందించారు.సిద్ధార్థ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం జగన్ మోహన్ రెడ్డి స్వగృహం దగ్గర గ్రామ పెద్దలు అయిన పిక్కిలి.బలరాముడు,సుదర్శన్ రెడ్డి,మండ్ల శ్రీనివాసులు వీరికి జగన్ మోహన్ రెడ్డి మరియు గ్రామ సర్పంచ్ జి.భూదేవి 50వేల రూపాయల చెక్కును వారికి అందజేశారు.ఈ సందర్భంగా సంఘ పెద్దలు మరియు గ్రామ ప్రజలు సిద్ధార్థ రెడ్డికి మరియు జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వార్డు నెంబర్ జిలకర శ్రీనివాసులు,వైసీపీ నాయకులు పి.సాంబశివుడు షేక్ అహ్మద్,హరీష్,నాగన్న,చిన్న హుస్సేనయ్య, సోమశేఖర్,తదితరులు పాల్గొన్నారు.

About Author