NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సొసైటీ గోడౌన్ ను ప్రారంభించిన సిద్ధార్థ రెడ్డి

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చెరిపిచర్ల గ్రామంలో సొసైటీ గోడౌన్ ను రాష్ట్ర శాప్ ఛైర్మెన్ సిద్ధార్థ రెడ్డి,ఎస్ మరియమ్మ,నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ధారా సుధీర్ శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభించారు.సిద్ధార్థ రెడ్డికి మరియు డాక్టర్ సుధీర్ కు గ్రామ సర్పంచ్ మరియు వ్యవసాయ శాఖ ఏడీ విజయ శేఖర్,మండల వ్యవసాయ అధికారి ఎం.పీరు నాయక్ పూల బోకేలతో ఘన స్వాగతం పలికారు.అనంతరం 40 లక్షల నాబార్డ్ నిధుల ద్వారా నూతనంగా నిర్మించిన వ్యవసాయ ఉత్పత్తుల కేంద్రాన్ని వారు రిబ్బన్ కట్ చేసి శిలఫలకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ నారాయణరెడ్డి, జడ్పిటిసి సభ్యులు పర్వత యుగంధర్ రెడ్డి,ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ,దాసి కృష్ణారెడ్డి, సహకార సొసైటీ చైర్మన్ నాగ తులసిరెడ్డి వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తువ్వా చిన్న మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ నబి రసూల్,సర్పంచులు మదార్ సాహెబ్,ఫణి భూషణ్ రెడ్డి,పి.చిన్న రామచంద్రారెడ్డి,మర్రి రామచంద్రుడు,జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ రాముడు,సాదిక్,సాంబశివుడు,గోపాల్ రెడ్డి,ఎలీషా తదితరులు పాల్గొన్నారు.

About Author