PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నూతన దేవాలయంలో పూజలు చేసిన సిద్ధార్థ

1 min read

-ఘన స్వాగతం పలికిన నాయకులు

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరు గ్రామంలో గ్రామస్తుల సహకారంతో నూతనంగా నిర్మించిన గ్రామ దేవత కర్రెమ్మ గుడి దేవాలయంలో రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం దేవాలయంలో పూజలు చేశారు.సిద్ధార్థ రెడ్డికి గ్రామ సర్పంచ్ జి.భూదేవి మరియు గ్రామ వైసీపీ నాయకులు బలరాముడు ఆధ్వర్యంలో పూలతో మరియు బాణాసంచా  కాలుస్తూ ఘన స్వాగతం పలికారు.గత మూడు రోజులుగా దేవాలయంలో కేశవయ్య పూజలు నిర్వహిస్తున్నారు.ప్రజలు మహిళలు యువకులతో మాట్లాడుతూ సిద్ధార్థ రెడ్డి ముందుకు సాగారు.చివరి రోజున నిన్న మధ్యాహ్నం ప్రజలకు వైసీపీ నాయకులు బలరాముడు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ వైసీపీ నాయకులు పి సాంబశివుడు,సుదర్శన్ రెడ్డి, శ్రీనివాసులు,పి హరీష్,షేక్ అహ్మద్,వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తువ్వా చిన్న మల్లారెడ్డి,జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాముడు,సహకార సొసైటీ చైర్మన్ నాగ తులసి రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు పెద్దమౌలా,జెసిఎస్ ఎం కన్వీనర్ రవికుమార్,వివిధ గ్రామాల సర్పంచులు మదార్ సాహెబ్,నాగస్వామి రెడ్డి,ఫ నిభూషణ్ రెడ్డి,మర్రి రామచంద్రుడు,చిన్న రామచంద్రారెడ్డి,బాలిరెడ్డి, గోపాల్ రెడ్డి,సాదిక్,పుల్లయ్య మరియు వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

About Author