PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సిద్దార్థ  సైన్యం రెడీ..!

1 min read

– అధ్యక్ష పదవులు సిద్దార్థ వర్గానికే.

– 2024  ఎన్నికల సమరానికి  సైన్యం సిద్ధం..!

– నందికొట్కూరు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట.

– సిద్దార్థ ను నమ్ముకున్న పలువురికి నామిటెడ్ పదవులు..

– 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యం..

పల్లెవెలుగు  వెబ్​ నందికొట్కూరు: నందికొట్కూరు  నియోజకవర్గం లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  మండల, పట్టణ అధ్యక్షులను నూతనంగా ఆ పార్టీ అధిష్టానం పలువురికి పదవులు కేటాయించింది. పాతవారిని ఐదు మందిని తొలగించి ఇద్దరిని మాత్రమే అలాగే  కొనసాగించారు.పగిడ్యాల, జూపాడుబంగ్లా,  నందికొట్కూరు, పాములపాడు మండలం లో ,నందికొట్కూరు పట్టణంలో   కొత్తవారికి అవకాశం కల్పించారు .మిడుతూరు, కొత్తపల్లి  మండలంలో మాత్రమే అధ్యక్షులు గా  పాతవారినే  కొనసాగిస్తు నియమాలను చేపట్టారు. నందికొట్కూరు పట్టణంలో సైతం పాతవారిని తొలగించి కొత్త వారికి అవకాశం కల్పించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ అధిష్టానం ఆయా మండలాల పార్టీ అధ్యక్షులను నియమించింది. 

వైసీపీ నియోజకవర్గ అధ్యక్షులు వీరే..

నంది కొట్కూరు నియోజకవర్గ వైకాపా సమన్వకర్త, రాష్ట్ర శాప్ చైర్మన్  వైకాపా యువజన విభాగం రాష్ట్ర  అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆశీస్సులతో నందికొట్కూరు నియోజకవర్గంలో  సిద్దార్థ రెడ్డి వర్గానికి చెందిన నేతలకు పదవులు దక్కాయి. ఇందులో  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  నందికొట్కూరు మండల అధ్యక్షుడిగా బిజినవేముల సర్పంచి రవి యాదవ్, పట్టణ అధ్యక్షుడిగా మన్సూర్ అహమ్మద్  , పగిడ్యాల మండల అధ్యక్షుడిగా మాజీ జడ్పిటిసి సభ్యులు పుల్యాల నాగిరెడ్డి, జూపాడుబంగ్లా మండల అధ్యక్షుడు తోకల కృష్ణా రెడ్డి, పాములపాడు మండల అధ్యక్షుడుగా గండగారి  రామలింగేశ్వర రెడ్డి, మిడుతూరు మండల అధ్యక్షుడు గా తువ్వా లోకేశ్వర రెడ్డి, కొత్తపల్లి మండల అధ్యక్షుడు గా కె. సుధాకర్ రెడ్డి లను వైసీపీ అధిష్టానం నియమించింది.

పాతవారిలో ఇద్దరికే మళ్లీ అవకాశం…

పగిడ్యాల మండలానికి పార్టీ అధ్యక్షులు వ్యవహరిస్తున్న మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రమేష్ నాయుడు , నందికొట్కూరు పట్టణానికి పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్న మైనార్టీ నాయకులు అభూ బక్కర్ , జూపాడుబంగ్లా మండలం  పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్న నాగార్జున రెడ్డి, నందికొట్కూరు మండలం పార్టీ అధ్యక్షులుగా ఉన్న ఓంకారేశ్వర రెడ్డి , పాములపాడు మండలానికి పార్టీ అధ్యక్షులుగా ఉన్న మాజీ ఎంపీటీసీ చౌడయ్య లను  తొలగిస్తూ కొత్తపల్లి మండలం సుధాకర్ రెడ్డిని , మిడుతూరు మండలం తువ్వా లోకేశ్వర రెడ్డి లను అలాగే  కొనసాగిస్తూ ఐదు మంది కొత్త వారికి పదవులను కేటాయించారు . 

అనుభవజ్ఞులకే  అధ్యక్ష పదవులు..

పగిడ్యాల మండలానికి పార్టీ అధ్యక్షులుగా ఉండిన మాజీ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ రమేష్ నాయుడు స్థానంలో పగిడ్యాల  గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు  మాజీ జడ్పీటీసీ పుల్యాల నాగిరెడ్డి కి  పార్టీ మండల అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు.పుల్యాల నాగిరెడ్డికి మండలంలో తిరుగులేని నాయకత్వం ఆయన సొంతం. ఆయన నాయకత్వంలో  పార్టీ ఒకే తాటిపై నడుస్తుంది.  జూపాడుబంగ్లా మండలానికి పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతుండిన నాగార్జున రెడ్డి ని  పదవి నుంచి తప్పించి  మండలంలో  వైస్ ఎంపీపీ గా  ఉంటున్న మండ్లెం గ్రామానికి చెందిన  తోకల కృష్ణా రెడ్డికి పార్టీ మండల అధ్యక్ష బాధ్యతలను అప్ప గించారు. నందికొట్కూరు పట్టణ అధ్యక్షుడు గా కిరాణం అసోసియేషన్ అధ్యక్షుడు మన్సూర్ అహ్మద్ ను నియమించారు. పాములపాడు  మండలానికి సీనియర్ నాయకుడు  మాజీ ఎంపీటీసీ చౌడయ్య  పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తి స్తుండగా ఆయనను మండల పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి పాములపాడు  జడ్పీటీసీ భర్త వైసీపీ యువ నాయకుడు  రామలింగేశ్వర రెడ్డి కి  పార్టీ మండల అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. ఈయన ఎమ్మెల్యే వర్గంలో కొనసాగుతూ ఈ మధ్యనే సిద్దార్థ వర్గంలో చేరినట్లు సమాచారం. నందికొట్కూరు మండలం పార్టీ అధ్యక్షుడుగా కొనసాగుతున్న ఓంకారేశ్వర రెడ్డిని తప్పించి సౌమ్యుడైన  బిజినవేముల సర్పంచి రవి యాదవ్ కు మండల అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.రవి యాదవ్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డికి అత్యంత సన్నిహితులు. సిద్దార్థకు నమ్మకాస్తుడు. ఈ టీమ్ త్వరలో జరగబోయే ఎన్నికలకు  సమాయత్తం అవుతోంది.నందికొట్కూరు నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో  వైసీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా టీమ్ కృషి చేయాలి. అసమ్మతి కార్యకర్తలు నాయకులను కలుపుకుని సమన్వయం చేసుకుంటూ పార్టీ అధ్యక్షులు ముందుకు సాగాలి.లేదంటే వైసీపీ మూల్యం చెల్లించక తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

About Author