NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఫిల్మ్ ఛాంబ‌ర్ కు `సిరివెన్నెల‌` పార్థివ‌దేహం.. మ‌హాప్ర‌స్థానంలో అంత్య‌క్రియ‌లు

1 min read

పల్లెవెలుగు వెబ్​:  ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి మృతితో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ శోక‌సంద్రంలో మునిగిపోయింది. ఆయ‌న మ‌ర‌ణం తెలుగు సినీ పరిశ్ర‌మ‌కు తీర‌ని లోటును మిగిల్చింద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డ్డారు. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిల్మ్‌ ఛాంబర్‌కు తీసుకొచ్చారు. డైరెక్టర్‌ త్రివిక్రమ్, క్రిష్‌లతో పాటు పలువురు ప్రముఖులు సిరివెన్నెల భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన కడసారి చూపు కోసం వేలాదిగా అభిమానులు ఫిల్మ్‌ఛాంబర్‌కు తరలివస్తున్నారు. కాగా మధ్యాహ్నం 1 గంటలకు సిరివెన్నెల అంతిమయాత్ర మొదలుకానుంది. మహాప్రస్థానంలో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

About Author