PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆగస్టులో వస్తున్న ‘ఆరడుగుల బుల్లెట్‌ ’

1 min read

సినిమా డెస్క్​: అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా తమ చిత్రాలను థియేటర్లలో రిలీజ్‌ చేసేందుకు దర్శకనిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా గోపీచంద్‌, నయనతార ప్రధాన పాత్రలుగా బి. గోపాల్‌ దర్శకత్వంలో రూపొందిన ‘ఆరడుగుల బుల్లెట్‌’ మూవీని ఆగస్టులో రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. జయబాలజీ రీల్ మీడియా పతాకంపై తాండ్ర రమేష్ నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా నిర్మాత స్వయంగా రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. ప్రకాష్‌రాజ్-, బ్రహ్మానందం,- అభిమన్యు సిన్హా తదితరులు ఇందులో నటించారు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ, మణిశర్మ మ్యూజిక్ అందించారు. ఇదిలా ఉండగా గోపిచంద్ నటించిన ‘సీటీమార్’ మరోవైపు రిలీజ్ కావాల్సి ఉంది. ఈ మూవీ కరోనా సెకండ్ వేవ్ కి ముందే రిలీజ్ తేదీని ప్రకటించారు. అయితే కరనా మహమ్మారి ప్రభావం పెరగడంతో వాయిదా వేసారు. నెక్ట్స్‌ గోపిచంద్ మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’లో నటిస్తున్నారు. జీఏ 2 సంస్థ యువిక్రియేషన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

About Author