PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎం..సీఎం.. అంటూ నినాదాలు..

1 min read

వారించిన ఎన్టీఆర్
హైద‌రాబాద్: ‘తెల్లవారితే గురువారం’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఆదివారం ఘ‌నంగా జ‌రిగింది. ముఖ్య అతిథిగా జూనియ‌ర్ ఎన్టీఆర్ హాజ‌ర‌య్యారు. కీర‌వాణి త‌న‌యుడు శ్రీ సింహ ఈ సినిమాలో క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ `త‌న‌కు నాన్న త‌ర్వాత రాజ‌మౌళి కుటుంబం చాలా ముఖ్యమ‌న్నారు. తాను అతిథిగా రాలేద‌ని, కుటుంబ స‌భ్యుడిగా వ‌చ్చాన‌ని అన్నారు. దేవుడిచ్చిన శక్తి అభిమానులైతే.. దేవుడిచ్చిన కుటుంబం జ‌క్కన్న కుటుంబ‌మ‌ని అన్నారు. త‌న నిర్ణయాల వెనుక ప్రత్యక్షంగానో, ప‌రోక్షంగానే ఈ కుటుంబం ఉంటుంద‌ని ఎన్టీఆర్ అన్నారు. చాలా ఎమోష‌న‌ల్ గా మాట్లాడారు జూనియ‌ర్ ఎన్టీఆర్. త‌న పిల్లలు ఎదిగితే ఎంత సంబరప‌డ‌తానే.. కీరవాణి గారి పిల్లలు ఎదుగుతుంటే అలాంటి సంతోష‌మే ఉంద‌న్నారు. అయితే.. ఎన్టీఆర్ మాట్లాడుతున్నంత సేపు అభిమానుల కేక‌లు, ఈల‌ల‌తో ఆ ప్రాంగ‌ణం మార్మొగింది. ఎన్టీఆర్ సీఎం..సీఎం..అంటూ అభిమానులు నినాదాలు చేశారు. దీంతో ఎన్టీఆర్ వారిని వారించారు. ఇది సమ‌యం, సంద‌ర్భంగా కాద‌ని అన్నారు.

About Author