PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అలా.. అడుక్కోవడం చూసి బాధేసింది !

1 min read

పల్లెవెలుగువెబ్ : తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దగా భావించే మెగాస్టార్ చిరంజీవి.. తన స్థాయిని మరిచి ఏపీ ప్రభుత్వాన్ని యాచించడం నచ్చలేదని అన్నారు సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఓ 20 నుండి 25 కోట్ల కోసం ఇండస్ట్రీకి దిగ్గజాలైన చిరంజీవి, మహేష్, ప్రభాస్, రాజమౌళి వంటి వారు వెళ్లి అడుక్కోవడం నిజంగా బాధ అనిపించింది. చిరంజీవి వంటి వ్యక్తి అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం శాసించే వాళ్లం కాకపోయినా.. టాక్స్‌లు కడుతున్నవాళ్లమే. అలాగే మనం కూడా ఓటేసిన వాళ్లమే. మన గౌరవాన్ని కాపాడుకుంటూ.. ఎదుటివారిని కూడా గౌరవిస్తూ మాట్లాడాలి. అంతేకానీ, అణిగిపోయి అణగారిన వర్గంలా ఉండాల్సిన అవసరం లేదు. అందుకే ఇదంతా చూసి.. నాకు బాధగా అనిపించింది..’’ అని తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడించారు.

          

About Author